మరోసారి ఆర్ఎస్ఎస్ ను లక్ష్యంగా చేసుకున్నారు రాహుల్ గాంధీ. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈకి కొత్త భాష్యం చెప్తూ అది ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ శిక్షా శ్రేడర్ అంటూ అభివర్ణించారు. తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేస్తూ బీజేపీ ప్రభుత్వం విద్యావిధానాన్ని అణచివేస్తోందని అన్నారు. అది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కాదని… ”సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సప్రెసింగ్ ఎడ్యుకేషన్” అంటూ ఓ ట్వీట్లో విమర్శించారు. నూతన జాతీయ విద్యావిధానం అమల్లో భాగంగా 10, 12 తరగతుల సిలబస్లో సీబీఎస్సీ మార్పులపై ఆయనీ వ్యాఖ్య చేశారు. పలు అంశాలను ముక్కలుగా చేస్తున్నట్టు చూపించే ‘షెడ్రింగ్ మిషన్’ ఫోటోను జోడించారు. ప్రజాస్వామ్యం, వైవిధ్యం, వ్యవసాయంపై గ్లోబలైజేషన్ ప్రభావం, అలీన విధానం, ది మొఘల్ కోర్ట్, పారిశ్రామిక విప్లవం, ఫయిజ్ పోయిమ్స్, ఎంప్లాయిమెంట్, మతసామరస్యం, వ్యవస్థలు వంటి అంశాలను షెడ్రింగ్ మిషన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నట్టున్న ఫొటోను ట్వీట్ కు జతచేశారు. అదే సందర్భంలో అసలు విద్యావిధానంతో ఏమాత్రం ప్రమేయం, సంబంధం లేని ఆర్ఎస్ఎస్ పై అక్కసు వెల్లగక్కాడు కాంగ్రెస్ నేత.
https://twitter.com/RahulGandhi/status/1518442420173639680?s=20&t=dpkVwi7j9mY-WgDtQEEw9w
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)