దేశంలోని ద్రవ్యోల్బణ, నిరుద్యోగ పరిస్థితులు చూస్తుంటే భారత్ శ్రీలంకలాగే కనిపిస్తోందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజల దృష్టిని మళ్లించడంవల్ల వాస్తవ పరిస్థితులు మారబోవని ట్వీట్ చేశారు.
మూడు గ్రాఫ్ లను అందుకు జతచేస్తూ భారత్ శ్రీలంకమాదిరిగానే ఉందన్నారు. రెండు దేశాల్లో నిరుద్యోగం, పెట్రోల్ ధరలు, మతహింసను పోలుస్తూ ఉన్న గ్రాఫ్ లు అవి. సాయుధ సంఘర్షణ ప్రాంతాలు, ఈవెంట్ డేటా ప్రాజెక్ట్, లోక్సభ అన్స్టార్డ్ ప్రశ్నలు, సీఎంఐఈ, పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్, శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ వెల్లడించిన సమాచారం ఆధారంగా ఉన్న నివేదికల్ని ఆయన ట్వీట్ కు జతచేశారు.
Distracting people won’t change the facts. India looks a lot like Sri Lanka. pic.twitter.com/q1dptUyZvM
— Rahul Gandhi (@RahulGandhi) May 18, 2022