రాహుల్ గాంధీని సీరియస్గా తీసుకోవడం అవసరమా..?
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన రాజకీయంగా చేసే వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోక్స్ పేలుతుంటాయి. తాజాగా కొద్ది రోజులుగా కాస్త మెచూర్ మైండ్తో మాట్లాడుతున్నారనుకుంటే.. మరోసారి తప్పులో కాలు వేశారు. ఇప్పటికే ఆయన్ను విపక్షాలు “పప్పు” అంటూ సంభోధించే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన నియంతల పేర్లన్నీ “ఎం”తోనే స్టార్ట్ అవుతాయన్న ట్వీట్తో మరోసారి తప్పులో కాలు వేసి నవ్వులపాలవుతున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవ్వడమే కాకుండా.. రాహుల్ పరువు పోయేలా చేసింది. ప్రపంచంలో చాలా మంది నియంతల పేర్లు “ఎం” అక్షరంతోనే ఎందుకు మొదలవుతాయంటూ ముసోలిని, ముషారఫ్, ముబారక్ల పేర్లు ఉటంకిస్తూ పరోక్షంగా మోదీపై విమర్శలు గుప్పించారు.
అయితే రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోస్ట్ చేసే ముందు ఆలోచించి చేయాలంటూ రాహుల్ను ఎకిపారేశారు. “ఎం” అక్షరంతోనే మోహన్ దాస్ కరం చంద్ గాంధీ పేరు ప్రారంభమవుతుందని.. మాజీ ప్రధాని (మౌన ముని) పేరు కూడా మన్మోహన్ సింగ్ అని.. వీరి పేర్లు కూడా “ఎం” అక్షరంతోనే ప్రారంభమయ్యాయంటూ రాహుల్పై ఎటాక్ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా రాహుల్కు గుర్తు చేశారు. అయితే బీజేపీ చీఫ్ జయ ప్రకాష్ నడ్డా మాత్రం రాహుల్ వ్యాఖ్యలను, ట్వీట్స్ను సీరియస్గా తీసుకోవడం అవసరమా అంటూ ప్రశ్నించారు.