ఈనెల 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విదేశాలకు వెళ్లిపోయారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆయన యూరప్ వెళ్లినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ సమావేశాలకు ఒకరోజు ముందు అంటే ఈనెల 17న ఆయన తిరిగి భారత్ వస్తారని చెబుతున్నారు. అయితే రాష్ట్రపతి ఎన్నిక తరుణంలో 14వ తేదీ జరిగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య సమావేశానికి రాహుల్ ఉండడం లేదు.
రాష్ట్రపతి ఎన్నికతో పాటు… అక్టోబర్ 2 నుంచి ప్రారంభించే…యునైటెడ్ ఇండియా క్యాంపెయిన్ “భారత్ జోడో యాత్ర” కు సంబంధించిన ప్రణాళికపైనా చర్చించనున్నారు. కిందటి రాహుల్ విదేశీ పర్యటన వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. నేపాల్ ఖట్మాండూలోని ఓ నైట్ క్లబ్ లో ఆయన ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ తరువాత మేలో కూడా రాహుల్ యూకే వెళ్లారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల వేళ ఆయన మరోసారి లండన్ పర్యటకు వెళ్లడం చర్చనీయాంశమైంది.