కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ విదేశీ పర్యటన వివాదాస్పదం అవుతోంది. ఇతర దేశాలలో పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రతిసారి రాహుల్ గాంధీ తప్పులు మీద తప్పులు చేస్తున్నారు తీవ్రంగా వ్యతిరేకించే నాయకులతో భేటీ అవుతుండటం వివాదాలకు కారణమవుతోంది. ఇటువంటి చర్యల వల్ల భారత్ నెరపుతున్న విదేశీ వ్యవహారాల వ్యూహాత్మక అడుగులకు ఇబ్బంది ఏర్పడుతుంది.
తాజాగా అమెరికా పర్యటనలో కూడా రాహుల్ గాంధీ భారత్ వ్యతిరేక నాయకులతో సమావేశం అవుతున్నారు. అక్కడ కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్లీ జేమ్స్ షెర్మాన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అమెరికా చట్టసభల సభ్యులతో సమావేశమయ్యారు. మిన్నెసోటా ప్రతినిధి ఇల్హాన్ ఒమర్తో సహా పలువురు అమెరికా చట్టసభ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు,
ఆయన భారత వ్యతిరేక భావాలను సమర్థించడంలో పేరు పొందారు.
అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో మిన్నెసోటా 5వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ప్రతినిధి అయిన ఇల్హాన్ ఒమర్ తరచూ భారత్ పై తీవ్రమైన వివాదాస్పద విమర్శలు చేయడంలో పేరొందారు. ఇటీవల, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ మరణంపై భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం చెలరేగినప్పుడు, ఒమర్ కెనడియన్ దర్యాప్తుకు మద్దతు ఇవ్వాలని అమెరికాను కోరారు.
పైగా, అమెరికాలో ఇలాంటి కార్యకలాపాలపై ఓ ప్రకటన చేయాలని అభ్యర్థించారు. ఈ ప్రకటన భారత రాజకీయ నాయకుల నుండి తీవ్ర ప్రతిస్పందనను ప్రేరేపించింది. ఒమర్తో రాహుల్ గాంధీ భేటీపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆగ్రహంతో ప్రతిస్పందించింది.
ప్రతి విదేశీ పర్యటనలో “రాడికల్, భారతదేశానికి వ్యతిరేక అంశాల”తో ఎందుకు నిమగ్నమవుతున్నారని ప్రశ్నించింది.
బిజెపి అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ, “సిక్కులపై విషం చిమ్మిన తర్వాత, విదేశీ గడ్డపై భారత వ్యతిరేక ప్రచారం చేసిన తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ భారతదేశ వ్యతిరేక ఇల్హాన్ ఒమర్తో సమావేశమయ్యారు. నిమగ్నమయ్యారు” అంటూ ఆయన మండిపడ్డారు.
మొత్తం మీద రాహుల్ గాంధీ పర్యటన మరోసారి వివాదాస్పదం అయింది. ఇటువంటి పనులతో పబ్లిసిటీ కొట్టేయాలని రాహుల్ గాంధీ టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ దేశ విశాల ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుంది అన్న వాస్తవాన్ని వదిలేస్తున్నారు.