రాహుల్ గాంధీ 2 పౌరసత్వాల అంశం మరోసారి తన మీదకు వచ్చింది బ్రిటన్ పౌరసత్వాన్ని ఆయన కలిగి ఉన్నారు అన్నమాట బలంగా వినిపిస్తోంది. దీనిమీద అలహాబాద్ హైకోర్టులో పిటీషన్ దాఖలు అయింది.
. ఈ పిటిషన్ పై స్పందించిన అల్లాహాబాద్ హైకోర్టు … కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుండి వివరణ కోరింది.
వివరాలు ఇలా ఉన్నాయి.
బిజెపి నేత విగ్నేష్ శిశిర్ దాఖలు చేసిన పిఐఎల్ లో రాహుల్ గాంధీకి భారత దేశ పౌరసత్వంతో పాటు యునైటెడ్ కింగ్ డమ్ పౌరసత్వం కూడా ఉందని ఆరోపించారు. అందుకు ఆధారాలుగా కొన్ని పత్రాలను సమర్పించారు. భారతదేశంలో ద్వంద పౌరసత్వం అనేది నిషేదించారు. భారతదేశంలో ఒక వ్యక్తి రెండు దేశాల పౌరసత్వం కలిగి ఉండటం చట్టపరంగా అనుమతించరు.
భారత రాజ్యాంగం ప్రకారం, భారతదేశ పౌరసత్వం పొందిన వ్యక్తి ఇతర దేశం పౌరసత్వం తీసుకుంటే, భారతదేశం పౌరసత్వం రద్దు అవుతుంది. ఈ విధంగా, ద్వంద పౌరసత్వం భారతదేశంలో తీసుకోబడే విధానం కాదు. ఇటీవల జాతీయ రాజకీయాలలో చోటుచేసుకున్న ఈ వివాదంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
మొత్తం మీద రాహుల్ గాంధీ 2 పౌరసత్వాల వివాదం మీద ఆ కుటుంబం స్పష్టమైన వివరణ ఇవ్వడం లేదు. దీంతో దుమారం అంతకంతకు పెరుగుతోంది.