రెండురోజుల తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ముస్లిం యువకుల చేతిలో హత్యకు గురైన దళితయువకుడు నాగరాజు కుటుంబాన్ని మాత్రం పరామర్శించలేకపోయారు. అయితే రాహుల్ బిజీ షెడ్యూల్ వల్లే నాగరాజు కుటుంబాన్ని రాహుల్ పరామర్శించలేకపోతున్నారని పార్టీ నాయకులు తెలిపారు. అదీ కాక భద్రతా సమస్యల దృష్ట్యా కూడా వెళ్లడం కుదర్లేదని పార్టీ నేత గీతారెడ్డి అన్నారు.
నాగరాజు భార్య పల్లవిని రాహుల్ పరామర్శిస్తారా అని ఓ మీడియా ప్రతినిధి ప్రత్యేకంగా అడగ్గా… రాహుల్ వెళ్లే విమానం ఖరారైపోయిందని.. ఆయన దాన్ని వాయిదా వేసుకుని నాగరాజు కుటుంబాన్ని పరామర్శిస్తారో లేదో తాను చెప్పలేనని అన్నారు.
“Not in Rahul Gandhi's schedule”, Cong leader confirms that the former party president, who is in #Hyderabad currently, will not be meeting the family of #Nagaraju who was brutally murdered
'This is typical of RaGa's one-eyed secularism', says @Shehzad_Ind
@sowmith7 @roypranesh pic.twitter.com/k0US5U0yFE
— TIMES NOW (@TimesNow) May 7, 2022
అయితే గీతారెడ్డి వ్యాఖ్యల్ని మెన్షన్ చేస్తూ బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్లా మండిపడ్డారు. నాగరాజును హత్య చేసింది ముస్లిం కనుకే రాహుల్ పరామర్శించలేదని…హత్రాస్ లో దళిత బాలిక మీద గ్యాంగ్ రేప్ జరిగితే వెంటనే వెళ్లిన రాహుల్ కు దళిత యువకుడు నాగరాజు కనిపించలేదని వ్యాఖ్యానించారు. కారణం ఇక్కడ నిందితులు నిజాంవారసులు కావడమేనన్నారు.
Nagaraju killed by Muslim wife’s family
Rahul Gandhi is in Hyderabad but Congress’ Geetha Reddy says Rahul won’t meet Nagaraju’s family
Had it been “Nizam” & had it been in UP, he would have left his partying in Nepal to visit but sadly Nagaraju/Hindus don’t matter for INC
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) May 7, 2022
అంతేకాదు బీజేపీ పాలిత ప్రాంతం కనుక ఆ ఘటనను రాజకీయంగా వాడుకోవడానికే రాహుల్ వెళ్లాడని ఆరోపించారు. రాహుల్ మాత్రమే కాదు ప్రియాంక కూడా హత్రాస్ ఘటనను రాజకీయం చేశారని గుర్తు చేశారు. మరిక్కడ నాగరాజు హత్యతో యువతి ఆశ్రిన్ బాధితురాలైందని వ్యాఖ్యానించారు.ఆ రోజు 144 సెక్షన్ విధించిన కారణంగా వారి కాన్వాయ్ ను ఆపేస్తే కార్లోంచి దిగిమరీ నడిచి వెళ్లారని యూపీ సీఎం యోగీకి వ్యతిరేకంగానినాదాలు చేశారని..ఇప్పుడెందుకు హడావుడి చేయడం లేదని నిలదీశారు. ఆ సందర్భంలో పోలీసులు తనను మ్యాన్ హ్యాండిలింగ్ చేశారనీ చిన్న వీడియో క్లిప్ ను వైరల్ చేసింది కాంగ్రెస్ పార్టీ.