నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబందించిన మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ ఆఫీసుకు వెళ్లారు. నాలుగు రోజుల విరామం తర్వాత రాహుల్ మళ్లీ ఈడీ విచారణకు ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరయ్యారు. గత వారం 3 రోజులు ఈడీ అధికారులు రాహుల్ గాంధీని విచారించిన విషయం తెలిసిందే. ఈ 3 రోజుల్లో దాదాపు 30 గంటల పాటు విచారణ కొనసాగింది. 3 రోజుల తదుపరి విచారం నిమిత్తం గత శుక్రవారమే హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. అయితే సోనియా గాంధీ అనారోగ్యం దృష్ట్యా విచారం వాయిదా వేయాలని ఆయన ఈడీని అభ్యర్తించారు. దీంతో సోమవారం రావాలని ఈడీ సమన్లు ఇచ్చింది.
మరోవైపు.. రాహుల్ గాంధీ విషయంలో ఈడీ విచారణ, కేంద్ర తెచ్చిన అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. ఈ సందర్భంగా సాయంత్రం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కాంగ్రెస్ ప్రతినిధుల బృందం కలిసింది.