రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ “భారత సైన్యం యొక్క శౌర్యం కంటే చైనీయులను ఎక్కువగా విశ్వసించే వ్యక్తి అని, భారతదేశం ఎప్పటికీ బలహీన దేశం కాదని ప్రపంచం మొత్తం భారత దేశం చెప్పేది వినడం మొదలుపెట్టిందని” పేర్కొన్నారు.
రాహుల్ ఇటీవల పార్లమెంటులో చేసిన ప్రకటనలకు సింగ్ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. గాల్వాన్ వ్యాలీ ఘర్షణలో భారత సైన్యం ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయిందని, చైనా సైనికులు కొద్ది మంది మాత్రమే మరణించారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాహుల్ భారత సైన్య వీరపరాక్రమాలపై కాకుండా చైనీస్ మీడియా ‘గ్లోబల్ టైమ్స్’ నివేదికపై ఎక్కువ విశ్వాసం కలిగి ఉన్నారని, ఇది చాలా అసాధారణమని రాజ్ నాథ్ ఆగ్రా, మథురలలో బహిరంగ సభల్లో ప్రస్తావించారు.
“భారత్ తెలిపిన నివేదిక సరైనదని నిరూపించి, తూర్పు లడఖ్ సెక్టార్లో జూన్ 2020 గాల్వాన్ వ్యాలీ ఘర్షణలో కనీసం 38 నుండి 50 మంది చైనా రక్షణ సిబ్బంది మరణించినట్లు ఇటీవల ఆస్ట్రేలియన్ మీడియా తెలియజేసిందని” రక్షణ మంత్రి చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పరిస్థితులు మారాయి, ఇప్పుడు ప్రపంచం భారతదేశం చెప్పేది వింటోంది. ఇంతకుముందు భారతదేశాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు, కానీ ఇప్పుడు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భారతదేశం బలహీనమైన దేశం కాదని అన్నారు. ఉరీ, పుల్వామాలో మన సైనికులు సరిహద్దుల్లో హతమయ్యారు, మేము సత్వర నిర్ణయాలు తీసుకున్నాము. భారతదేశం తన సరిహద్దును రక్షించుకోవడమే కాకుండా సరిహద్దుకు అవతలి వైపు కూడా దాడి చేయగలదని, సరిహద్దు దాటి ప్రపంచానికి సందేశం ఇచ్చాము. ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతలను మెరుగుపరిచినందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను రాజ్ నాథ్ ప్రశంసించారు.
నేరస్థులు, గుండాలు పారిపోతున్నారు, యూపీ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఎక్స్ప్రెస్వేలు వస్తున్నాయి, రోడ్లు నిర్మించబడుతున్నాయి. రాజకీయం సమాజాన్ని, దేశాన్ని తయారు చేయడం కోసమే తప్ప ప్రభుత్వాన్ని రూపొందించడం కోసం కాదని, రాజకీయాలు న్యాయం, అభివృద్ధిని కలిగి ఉండాలని, ‘వసుదేవ కుటుంబకం’పై మాకు నమ్మకం ఉందని, విభజన రాజకీయాలను బీజేపీ అంగీకరించబోదు.
“శ్యామా ప్రసాద్ ముఖర్జీ వంటి నాయకులు ఇచ్చిన హామీలను ఇతర పార్టీలు, నాయకులు పాటించి ఉంటే భారతదేశం వేరే విధంగా ఉండేదని మంత్రి అన్నారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ 1951 ఎన్నికలలో జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని జన్ సంఘ్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు, కాని మేము పార్లమెంటులో మెజారిటీని పొందలేకపోయాము. మాకు మెజారిటీ రాగానే మోదీ హయాంలో ఆర్టికల్ 370ని రద్దు చేశాం’’ అని రాజ్ నాథ్ అన్నారు.
“ఈ ఎన్నికల్లో MSP గురించి చాలా చర్చ జరుగుతోంది. బీజేపీ దానికి కట్టుబడి ఉందని నేను మీకు హామీ ఇస్తున్నాను. MSP అంశంపై తప్పుడు ప్రచారాలకు లొంగకండి, అందుకు బడ్జెట్లో తగిన కేటాయింపులు చేశామని ఆయన అన్నారు. కొత్త ఉత్తరప్రదేశ్, కొత్త భారతదేశం కోరుకునే ప్రజలు రాబోయే ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులకు ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.