ఇక అనర్హత వేటుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఎవరికైనా విమర్శించే హక్కు ఉంది తప్ప…అవమానించే హక్కులేదని…రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగానే వెనకబడిన వర్గాలవారిని అవమానించారని పార్టీ నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. మీడియోముఖంగా రాహుల్ మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలన్నారు. లండన్లో తానేం మాట్లాడలేదని రాహుల్ అడ్డంగా అబద్దాలాడారని…భారత్ లో ప్రజాస్వామ్యం బలహీనంగా ఉందని… యూరప్ దేశాలు దానిపై దృష్టిసారించాలని అన్నారని రవిశంకర్ గుర్తు చేశారు. సత్యమే మాట్లాడుతానని రాహుల్ చెప్పాడని..కానీ ఆయన చెప్పేవన్నీ అసత్యాలేననీ అన్నారు.