ప్రముఖ జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు జిబైర్ కు నాలుగు రోజుల కస్టడీ విధించింది న్యాయస్థానం. మత పరమైన మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఓ ట్వీట్ ద్వారా మతపరమైన మనోభావాలు దెబ్బతీశారంటూ సోమవారం జుబైర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒకరోజు కస్టడీ ముగిసిన తరువాత పోలీసులు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు.పోలీసులు మరో ఐదు రోజుల కస్టడీ కోరగా కోర్టు నాలుగురోజుల కస్టడీకి అనుమతిచ్చింది.
అటు జుబైర్ అరెస్ట్ ను కాంగ్రెస్ చీఫ్ రాహుల్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుబట్టారు. ఆయన చేసిన తప్పేంటని, ఎందుకు అరెస్ట్ చేసినట్టని కేంద్రాన్ని ఇరువురు నేతలూ నిలదీశారు.