తాను హిందువుగా గర్విస్తున్నానని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. అమేథీలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయనీ వ్యాఖ్య చేశారు. రాహుల్ హిందుత్వ స్టేట్ మెంట్ ను ఎత్తిపొడుస్తూ… మేం భారతీయులం, హిందుత్వ మా సాంస్కృతిక గుర్తింపు, మేం హిందువులమని గర్వంగా చెప్పండి అని అశేష జనవాహిని హర్షధ్వానాల మధ్య అన్నారు యోగీ. తాను హిందువునని చెప్పుకోవడానికి గర్విస్తానన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది అమేధీ. గాంధీ కుటుంబీకులకే అక్కడి నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. కిందటి లోక్ సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ అమేథీ నుంచి ఓటమి చవి చూశారు రాహుల్ గాంధీ.
హిందుత్వం, హిందు ధర్మం ఓ కులం, మతం ఆధారంగా విభజించేది కాదన్నారు. హిందు అనేది సాంస్కృతిక గుర్తింపు అని, అది కొందరు గుర్తించి ఉంటే కనుక 1947లో భారతదేశం ముక్కలై ఉండేది కాదనీ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికార వ్యామోహం, దురాశతో హిందువులు బలయ్యారన్నారు. హిందువులను అణచివేసేందుకే కశ్మీర్లో ఆర్టికల్ 370 అమలుచేశారని…ఇప్పుడు పునరుద్ధరించాలంటున్నారనీ ఆరోపించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ఆపారని, రామసేతును విధ్వంసం చేసేందుకు లాబీయింగ్ చేశారని, మత వ్యతిరేక విధానాల్ని తీసుకువచ్చారని అన్నారు. ఎన్నికలప్పుడు మాత్రం తాము హిందువులమని చెప్పుకుంటూ వస్తారు మిగతా సమయాల్లో మాత్రం హిందువుల విశ్వాసాలతో, జీవితాలతో ఆడుకుంటారు అని రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ అన్నారు సీఎం.
గుడిలో ఎలా కూర్చోవాలో తెలియని రాహుల్ గాంధీ యాక్సిడెంటల్ హిందువు అని… ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చే గాంధీ వారసుడు ఎన్నికల పర్యాటకుడు అని మోదీ మండిపడ్డారు.
“అమేథీ మాజీ ఎంపీకి గుడిలో ఎలా కూర్చోవాలో కూడా తెలీదు. 2017లో గుజరాత్ ఎన్నికల సమయంలో ఓ గుడిలో మోకాళ్లపై కూర్చుని పూజలు చేశారు. అలా కాదు ఇలా కూర్చోవాలి అని పూజారి చెప్పాల్సి వచ్చింది. కాళ్లు మడిచి కూర్చోమని పూజారి అంటే…అంటే ఏంటి ఎలా మడవాలి అని అడిగిన పెద్ద హిందువు రాహుల్ అని యోగీ గుర్తు చేశారు. తను వచ్చింది మసీదుకు కాదు మందిరానికి అని అక్కడున్నవాళ్లు గుర్తు చేయాల్సి వచ్చిందని..హిందు, హిందుత్వ అంటూ ఉపన్యాసాలు ఇచ్చేముందు ప్రాథమికాంశాలైనా నేర్చుకుంటే మంచిదని వ్యంగ్యంగా అన్నారు యోగి. హిందూ మతాచారలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతూ హిందుత్వ గురించి తప్పుడు ప్రచారం చేస్తే తెలివిలేనితనం బయటపడుతుందన్నారు.