సోషల్ మీడియా వేదికగా మహిళలను, బాలికలను వేధిస్తున్న రహీమ్ ఖాన్ అనే దుర్మార్డుడిని ఫరీదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రహీమ్ ఖాన్ వయస్సు 19 ఏళ్లు. గత కొద్ది రోజులుగా రహీమ్ ఖాన్ అమాయక మహిళలను, బాలికలను సోషల్ మీడియాలో వేధించడం ప్రారంభించాడు. ఫేస్బుక్,ఇన్స్టాగ్రాం వంటి సోషల్ మీడియా అకౌంట్లు కల్గిన వారి వ్యక్తిగత చిత్రాలను సేకరించడం.. అనంతరం వాటిని మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో తిరిగి అప్లోడ్ చేయడం రహీమ్ ఖాన్ నిత్యకృత్యంగా మారింది. దేశ వ్యాప్తంగా దాదాపు 50 మంది మహిళలను, బాలికలను వేధించినట్లు తెలుస్తోంది.
మార్ఫింగ్ చేసిన ఫోటోలను సదరు మహిళలకు, బాలికలకు పంపుతూ.. వారిని నగ్న చిత్రాలను,వీడియోలను పంపాలంటూ వేధించడం ప్రారంభించాడు. అయితే ఓ మహిళ ఫేక్ అకౌంట్తో అసభ్య మెసేజ్లు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రహీమ్ ఖాన్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో మార్ఫింగ్ చేసిన ఫోటోలను పంపుతూ వేధిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితురాలు ఇచ్చిన ఐడీ లాగిన్ అయిన అడ్రస్ను సేకరించి నిందితుడి కోసం గాలించడం ప్రారంభించారు. హర్యానా రాష్ట్రాంలోని ఫరీదాబాద్ పట్టణంలో ఓ ఇంట్లో రహీమ్ ఖాన్ను గుర్తించారు. పోలీసులు రహామ్ ఖాన్ను అరెస్ట్ చేసి విచారించగా.. అతడు దాదాపు 50 మంది మహిళలను, బాలికలను వేధించినట్లు ఒప్పుకున్నాడు. అంతేకాదు.. రహీమ్ ఖాన్ నుంచి అనేక వీడియో క్లిప్పింగ్స్తో పాటు.. పలు పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.