నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు సోమవారం విడుదల కానున్నారు. సుప్రీంకోర్టు నిన్ననే ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఆయన మాత్రం సోమవారమే బయటకు వచ్చే అవకాశం ఉంది.సుప్రీం ఆదేశాలు రఘురామ న్యాయవాదులకు అందడంలో ఆలస్యమే ఇందుకు కారణం. ఎల్లుండి ఆయన లాయర్లు కింది కోర్టులో పూచీకత్తు సమర్పించే అవకాశం ఉంది. రఘురామ ప్రస్తుతం సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రిలో ఉన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆయన వ్యాఖ్యలున్నాయనే ఆరోపణలతో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా పోలీసులు తనను కొట్టారని రఘురామ ఆరోపించారు.కోర్టు ఆదేశంలో జీజీహెచ్ లో పరీక్షలు సైతం నిర్వహించారు. అటు హైకోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఆయన కేంద్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.విచారణ అనంతరం సుప్రీం ఆయనకు బెయిల్ ఇచ్చింది.