19 ఏళ్ల తర్వాత.. గోద్రా రైలు సంఘటన కేసులో కీలక నిందితుడు రఫీక్ అరెస్ట్..!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోద్రా రైలు దహనం ఘటన గురించి తెలిసిందే. ఈ సంఘటన జరిగి దాదాపు 20 ఏళ్ల కావోస్తుంది. అయినప్పటికీ ఈ మారణహోమాన్ని బాధితులు
కానీ.. దేశ ప్రజలు కానీ మర్చిపోలేరు. 2002 ఫిబ్రవరి 27వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని గోద్రా రైల్వే స్టేషన్లో రామ భక్తులతో వెళ్తున్న సబర్మతి రైలును దహనం చేశారు. ఈ ఘటన
జరిగి దాదాపు ఇరవై ఏళ్లు కావోస్తుంది. రామ భక్తులతో వెళ్తున్న మొత్తం నాలుగు బోగీలపై ఉగ్రవాదులు పెట్రోల్ బాంబులు విసిరి 59 మంది రామ భక్తులను చంపేశారు. అయితే ఈ
సంఘటన పక్కా ప్లాన్ వేసి జరిపారు జిహాదీ మూకలు. గోద్రా రైలు సంఘటన అనంతరం గుజరాత్లో పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్నాయి. వందల మంది అమాయకులు ప్రాణాలు
కోల్పోగా.. అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అలాంటి మారణఖాండకు దారి తీసిన గోద్రా రైలు సంఘటనలో కీలక నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు.
రైలులో పెట్రోల్ పోసి రాళ్ల దాడి చేసిన కీలక నిందితుడు రఫీక్ హుస్సేన్ భతుక్ను సోమవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన అనంతరం పోలీసులు ఇతడి పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేయడంతో.. వెంటనే గుజరాత్ విడిచి పారిపోయాడు. ఢిల్లీకి చేరుకుని కూలి పనిచేసుకుంటూ పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నాడు. అయితే పోలీసులు అతడి కుటుంబంపై నిఘా పెట్టారు. కొన్నేళ్ల క్రితం రఫీక్ కుటుంబాన్ని కలవడంతో పాటు.. వారిని మరో ప్రదేశంలోకి తీసుకెళ్లడాన్ని పోలీసులు గమనించారు. ఈ క్రమంలో సోమవారం నాడు రఫీక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఎస్పీ లీనా పాటిల్ తెలిపారు. నిందితుడు రఫీక్ను తదుపరి విచారణ కోసం గోద్రా రైల్వే పోలీసులకు అప్పగించబోతున్నట్లు తెలిపారు. కాగా, ఇంకా ఇప్పటికీ మరో ముగ్గురు నిందితులు దొరకలేదని తెలిపారు. వారి పేర్లు సలీం ఇబ్రహీం బాదం అక సలీమ్ పన్వాలా, షౌకత్ చర్కా, అబ్దుల్ మజీద్ యూసుఫ్ మితా అని తెలిపారు. అయితే వీరంతా పాకిస్తాన్కు తప్పించుకుని పోయినట్లు తెలుస్తోంది.