కోట్లాది రూపాయలు నీటిపాలయ్యాయి. పనుల్లో నాణ్యతాలోపం కొట్టొచ్చినట్టు బయటపడింది. రాత్రి కురిసిన వర్షానికి యాదగిరి గుట్ట ఘాట్ రోడ్డు పూర్తిగా కుంగిపోయింది. ఒక్కవానకే రోడ్డు దెబ్బతినడం విస్మయపరుస్తోంది. భారీవర్షానికి ఆలయ క్యూకాంప్లెక్స్ లు కూడా వరదనీటితో నిండిపోయాయి. కొండపైనుంచి వర్షపు నీరు దిగువనున్న కాలనీల్లోకి చేరి ఆ ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక కొండనుంచి కిందకు కొత్తగా వేసిన రోడ్డు దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయినట్టు తెలుస్తోంది.
ఒక్క వర్షానికే రోడ్డు కుంగిపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. పార్కింగ్ ఫీజు బాదుడు మీదున్న శ్రద్ధ రోడ్లనాణ్యత మీద లేదా అని నిలదీస్తున్నారు. ఇటీవలే కొండపై పార్కింగ్ ఫీజును 500 రూపాయలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.