ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన వ్యక్తిని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను రాచకొండ సీపీ క్యాంప్ ఆఫీసు లో అభినందించారు.
శనివారం విజయవాడ బస్ స్టాప్ లో ఎల్ బి నగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ T. సతీష్ విధుల్లో ఉండగా.. జార్ఖండ్ కు చెందిన వలసకార్మికుడు మాంగ్ర (35) ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోయాడు. అక్కడున్న ప్రైవేటు ఉద్యోగి జాన్సన్ , ట్రాఫిక్ కానిస్టేబుల్ సతీష్ అతనిని మాటల్లో పెట్టి ఇటువైపు లాగి కాపాడారు. తరువాత పోలీసులకు అప్పగించారు. వ్యక్తి ప్రాణం కాపాడిన కానిస్టేబుల్ ను రాచకొండ కమిషనర్ సీపీ డి ఎస్ చౌహన్ ఐపిఎస్ తన కార్యాలయంలో అభినందించారు.