అది తాజ్ మహల్ కాదు తోజో మహల్ అనే శివాలయం అని దాన్ని నిర్థారించేలా మూసి ఉన్న తలుపులు తెరిచి పరిశోధించేలా ఆర్కియాలజీసర్వే ఆఫ్ ఇండియాకు ఆదేశాలివ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. మరో వైపు ఢిల్లీలోని కుతుబ్ మీనార్ ఉనికిపై సందేహం వ్యక్తం చేస్తూ కొన్ని హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. అది కుతుమ్ మీనార్ కాదని.. విష్ణుస్తంభమని అంటున్నారు. కొందరు హిందూ సంస్థల ప్రతినిధులు కాషాయజెండాలు చేతబట్టి పేరు మార్చాలని నిరసనకు దిగారు. యునైటెడ్ హిందు ఫ్రంట్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది.ఇవాళ నిరసనకు దిగుతామని ముందే ప్రకటించడంతో మరికొన్ని సంఘాల వాళ్లూ ఈ నిరసనలో పాల్గొన్నారు. కుతుబ్ మినార్ నిర్మాణంలో గణేష్ విగ్రహాలను విలోమ పద్దతిలో అమర్చారని, వెంటనే అవి అక్కడి నుంచి తొలగించి పూజించదగిన స్థలానికి తరలించాలని కూడా సంస్థ డిమాండ్ చేసింది.
https://twitter.com/AHindinews/status/1523933885926866945?s=20&t=ITnqt3IsThSl8t2O19X-Jg