ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడిపట్ల భారత వైఖరిని క్వాడ్ సభ్య దేశాలు సమర్థించాయి.వివాదానికి ముగింపు పలకడానికి ప్రధాని నరేంద్ర మోదీ తన పరిచయాలను ఉపయోగిస్తున్నందున అందరూ సంతోషంగా ఉన్నారని ఆస్ట్రేలియా అంది.
రష్యా దండయాత్రపై భారతదేశ వైఖరి 1957లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విధానానికి అనుగుణంగా కనిపించిందని, భారతదేశం సమస్యలను ఖండించే పనిలోమాత్రమే లేదని…వివాదాల పరిష్కారానికై దృష్టి పెడుతుందని దౌత్య వర్గాలు పేర్కొన్నాయి.
ఉక్రెయిన్లో సంక్షోభం పట్ల భారతదేశ వైఖరిపై పశ్చిమ దేశాలలో కొంత అశాంతి ఏర్పడింది. సోమవారం ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్తో మోడీ వర్చువల్ సమ్మిట్ మాట్లాడుతూ… ఉద్రిక్తస్థితి తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నామన్నారు.
క్వాడ్ భాగస్వాములైన US, జపాన్, ఆస్ట్రేలియాలాగా ఉక్రెయిన్పై రష్యా దాడిని భారతదేశం ఖండించలేదు.. చర్చలు, దౌత్యం ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించాలని ప్రయత్నిస్తుందనీ అన్నారు.
‘ప్రతి దేశానికి ద్వైపాక్షిక సంబంధాలు ఉంటాయి, వాటిని మేము అర్థం చేసుకున్నాం. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ, ప్రధాని మోడీ స్వయంగా తన పరిచయాలను ఉపయోగించి వివాదాన్ని ముగించాలని పిలుపునిచ్చారని’ భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ బారీ ఓ ఫారెల్ విలేకరులతో అన్నారు.
యుద్ధం ప్రారంభమైన తర్వాత మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో మూడు సార్లు సంభాషణలు జరిపారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీతో రెండుసార్లు మాట్లాడారు.
మార్చి 3న ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చించేందుకు క్వాడ్ దేశాల నాయకులు వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు.
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అంతర్జాతీయ భద్రతను కొనసాగించడానికి ఒప్పించడంలో మోదీ సహకారాన్ని కోరడం.. భారతదేశ ప్రాముఖ్యత, ఆ దేశం నుంచి వారి అంచనాలను ప్రతిబింబిస్తుందని వర్గాలు తెలిపాయి. శనివారం మోదీ, కిషిదా మధ్య జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఉక్రెయిన్ పరిస్థితి ప్రముఖంగా కనిపించింది.
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, మోదీ, మోరిసన్ సహా కిషిడా ఉక్రెయిన్లో కొనసాగుతున్న సంఘర్షణ, మానవతా సంక్షోభం గురించి చర్చించారని వైట్ హౌస్ విడుదల చేసిన నోట్ లో తెలిపింది.