ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిలో జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. రెండేళ్లుగా కోవిడ్ కారణంగా యాత్ర జరగలేదు. రెండేళ్ల తరువాత రంగరంగవైభవంగా జరుగుతున్న యాత్రకోసం లక్షలాదిగా భక్తులు పూరీ తరలివచ్చారు. పూరీపురి ఎటుచూసినా జనసంద్రమే.
జగన్నాథుడు తన సోదరీ సోదరులైన బలరాముడు, సుభద్రతో కొలువైన క్షేత్రం పూరి. అక్కడ ఏటా జరిగే రథయాత్రకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. ప్రతిఏటా జూన్ లేదా జూలై నెలల్లో శుక్ల పక్షం రెండవ రోజున జరుగుతుంది. ఈ ఏడాది ఇవాళ మొదలైంది.
https://twitter.com/ANI/status/1542741265070292997?s=20&t=5KoPwlwP_SB4O_QW4bdgYA
ఈసారి యాత్రకు 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. అందుకు తగినట్లు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. రథయాత్ర తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది.
ఉదయం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తోపాటు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలిసి పూరీ రైల్వే స్టేషన్లో జగన్నాథ రథయాత్రకు సంబంధించిన సన్నాహాలను నిన్న రాత్రి పరిశీలించారు.
ప్రతి సంవత్సరం జరిగే రథోత్సవం కోసం మూడు కొత్త రథాలను సిద్ధం చేస్తారు. ప్రకాశవంతమైన రంగులతో అలంకరిస్తారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడతారు. కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకుంటాయి. విదేశాలనుంచీ పెద్దసంఖ్యలో భక్తులు రథయాత్ర చూసేందుకు పూరీ తరలివస్తారు.
https://twitter.com/ANI/status/1542473583179419648?s=20&t=ZEk8u6ZUE3oxlgkbjaMLKw