బహుశా స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటన వంటిది యెప్పుడూ జరిగి వుండదు.
ఈ రోజు మోడీ, మేము లేచిన వేళ బాగుంది…
సాధారణంగా ప్రధాని పర్యటనకు చాలా భద్రతా రూల్స్ పాటిస్తారు. ముందుగా పర్యటన పూర్తి వివరాలు అంటే ఎన్ని గంటలకు, యే దారుల్లో వెళతారు అని బహిరంగంగా చెప్పరు.. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చీఫ్ సెక్రటరీలు, పోలీసు, ఇంటెలిజెన్స్ లో ఉండే ఉన్నతాధిారులకు మాత్రమే పూర్తి వివరాలు తెలుస్తాయి.
రాష్ట్ర పోలీసులు ప్రధాని SPG భద్రతా సిబ్బందికి రోడ్డు క్లియర్ గా వుంది అడ్డంకులు ఏవీ లేవు అని చెప్పిన తరువాత మాత్రమే PM భద్రతా సిబ్బంది ఆ రూట్ లో పిఎం వాహనం తీసుకువెళతారు.
అయితే ఈ రోజు ప్రధాని మోడీ పంజాబ్ రాష్ట్ర పర్యటనలో పంజాబ్ ప్రభుత్వం కావాలని ప్రధాని భద్రతను పట్టించుకోనట్లు కనిపిస్తోంది.
ఈ రోజు ప్రధాని పంజాబ్ లో హుస్సేన్వాలాలో గల నేషనల్ మార్టియర్స్ మెమోరియల్ కు హెలికాప్టర్లో వెళ్ళడానికి భాటిండా చేరుకున్నారు. అయితే వాన, వాతావరణం అనుకూలించక పోవడంతో రోడ్డు ద్వారా వెళ్ళడానికి పంజాబ్ చీఫ్ సెక్రటరీ, డిజిపి కి తెలియచేస్తే వారు రోడ్డు క్లియరెన్స్ ఇచ్చారు.
దాని ఆధారంగా ప్రధాని వాహన శ్రేణి ఒక ఫ్లై ఓవర్ మీదుగా వెళుతూ ఉంటే అకస్మాత్తుగా కొందరు ఆందోళనకారులు పెద్ద పెద్ద వాహనాలతో ఫ్లై ఓవర్ కి రెండవ వైపునుండి ప్రధాని వాహన శ్రేణికి ఎదురుగా రావడం జరగడంతో ప్రధాని వాహన శ్రేణి సుమారు 20ని.లా సేపు ఫ్లై ఓవర్ మీద చిక్కుకు పోయింది. ప్రధాని భద్రతా సిబ్బంది
పంజాబ్ ముఖ్యమంత్రి ని ఫోన్ ద్వారా సంప్రదిద్దామని ప్రయత్నిస్తే ముఖ్యమంత్రి ఫోన్ తీయలేదుట.
అసలే పంజాబ్ బోర్డర్ స్టేట్, తీవ్రవాదుల కదలికలు ఉంటున్నాయి. అటువంటి పరిస్థితుల్లో పంజాబ్ పోలీసులు ఇంత నిర్లక్ష్యం వహించారు అంటే నమ్మ బుద్ది కావడం లేదు.
ప్రధాని పర్యటనా సమాచారం ఎవరో కావాలని లీక్ చేసినట్లు కనపడుతోంది.. సాధారణంగా పోలీసులకు తెలియకుండా ఇటువంటి సంఘటన జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ప్రధాని, ముఖ్యమంత్రుల పర్యటనల సమయంలో ముందుగానే వారి భద్రతా సిబ్బంది రోడ్లు ఖాళీగా ఉంచుతారు..అడుగడుగునా పోలీసు పర్యవేక్షణ వుంటుంది.
చూడబోతే ఇది ఇటలీ మాఫియా పంజాబ్ ప్రభుత్వం తో కుమ్మక్కు అయి చేసిన కుట్ర లాగా కనిపిస్తోంది.
ఈ సంఘటన పై బాగా లోతైన విచారణ జరిపి దీని వెనుక ఉన్నది ఎవరో బయటపెట్టాలి.
….చాడా శాస్త్రి…



