పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఓ ఇంటివాడయ్యారు.హర్యానాకు చెందిన గురుప్రీత్ కౌర్ ను అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లాడారు.చండీగఢ్ లోని సెక్టార్ 2లో హంగూ ఆర్భాటాల్లేకుండా భగవంత్ , గురుప్రీత్ పెళ్లి జరిగింది. సిక్కు సంప్రదాయం ప్రకారం జరిగిన వీరి పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులతో పాటు డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు.గుర్ ప్రీత్ మౌలానా మెడికల్ కాలేజీలో వైద్యవిద్య చదివారు. రెండు కుటుంబాలకు కొన్నేళ్లుగా సాన్నిహిత్యంఉంది. పంజాబ్ ఎన్నికల్లో భగవంత్ మాన్ కోసం పనిచేశారు గురుప్రీత్. ఆమెకిది మొదటిపెళ్లి. భగవంత్ మాన్ కు మాత్రం రెండోపెళ్లి. ఆరేళ్ల క్రితమే మొదటి భార్య ఇంద్రప్రీత్ కౌర్ తో విడాకులయ్యాయి. ఆమె తన ఇద్దరు పిల్లలతో అమెరికాలో ఉంటున్నారు. భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారానికి తన కుమారులు సీరత్, దిల్షాన్ లు హాజరయ్యారు.