పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కడుపునొప్పితో బుధవారం అర్థరాత్రి ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీ సరితావిహార్ ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కడుపులో కడుపులో ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.
అంతకుముందు, రాష్ట్రంలోని ఇద్దరు గ్యాంగ్స్టర్లపై ఆపరేషన్ను విజయవంతంగా అమలు చేసినందుకు రాష్ట్ర పోలీసులను, యాంటీ గ్యాంగ్స్టర్ టాస్క్ఫోర్స్ను పంజాబ్ సీఎం అభినందించారు. అమృత్సర్లోని భక్నా గ్రామంలో పంజాబ్ పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో గ్యాంగ్స్టర్లు జగ్రూప్ సింగ్ రూప, మన్ప్రీత్ సింగ్ అలియాస్ మన్ను కుసా మరణించారని పోలీసులు తెలిపారు. సిద్ధూ మూసేవాలా హత్యకేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు పంజాబ్ పోలీసులతో దాదాపు ఐదు గంటలపాటు జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలో గ్యాంగ్స్టర్లు, సంఘ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా నిర్ణయాత్మక యుద్ధాన్ని ప్రారంభించిందని ఒక ప్రకటనలో భగవం
త్ మాన్ అన్నారు.