పంజాబ్ నూతన ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాష్ట్రంలో అవినీతి నిరోధక హెల్ప్లైన్ను ప్రారంభించనున్నట్లు గురువారం ప్రకటించారు. మార్చి 23న షహీద్ దివస్ రోజు ప్రారంభించనున్నారు. పంజాబ్ ప్రజలు అవినీతిపై వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
భగత్ సింగ్ బలిదానం రోజున.. మేము అవినీతి నిరోధక హెల్ప్లైన్ నంబర్ను ప్రారంభిస్తాము. ఆ నెంబర్ ను నేనే పర్సనల్ గా వాడతాను. ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగితే.. వీడియో/ఆడియో రికార్డ్ చేసి నాకు పంపండి. అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటాం. పంజాబ్లో అవినీతి ఇక పని చేయదు’ అని భగవంత్ ట్వీట్ చేశారు.
https://twitter.com/BhagwantMann/status/1504400986135097344?s=20&t=IKhHBQVRbFPOFjuYyhJ6zA
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)