పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ పెళ్లికొడుకు కాబోతున్నారు. ఆరేళ్ల క్రితం ఆయన తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. కొంతకాలంగా తనకు అండగా ఉంటున్న గురు ప్రీత్ కౌర్ అనే యువతిని భగవంత్ మాన్ వివాహం చేసుకోబోతున్నారు. గురువారం చండీగఢ్ లో సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. సాధారణ కుటుంబానికి చెందిన గుర్ ప్రీత్ కురుక్షేత్రలోని ముల్లానామెడికల్ కాలేజీలో వైద్యవిద్య చదివారు. ఇరువురి కుటుంబాల మధ్య కూడా సన్నిహిత సంబంధాలున్నట్టు తెలిసింది. మొన్నటి ఎన్నికల ప్రచారంలో భగవంత్ మాన్ కు అన్ని విధాలా సహాయసహకారాలు అందించారు గుర్ ప్రీత్ కౌర్.