పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, నీటిపారుదల ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. కొండమ్మ పోచమ్మ రిజర్వాయర్ ను సందర్శించారిన పంజాబ్ సీఎం…అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పంజాబ్ లో సాగునీటి ప్రాజెక్టులపై దృష్టిపెట్టామని…ఇక్కడ నీటిపారుదల వ్యవస్థను పరిశీలించేందుకు అధికారులతో కలిసి వచ్చినట్టు ఆయన తెలిపారు. మర్కుక్ మండలం ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల మధ్యనున్న చెక్ డ్యాంను, గజ్వేల్ పట్టణంలో మినీ ట్యాంక్ బండ్ గా చెప్పే.. పాండవుల చెరువునీ భగవంత్ మాన్ పరిశీలించారు.
https://twitter.com/BhagwantMann/status/1626142198747246592?s=20