అవినీతి ఆరోపణలపై ఆరోగ్య మంత్రి డాక్టర్ విజయ్ సింగ్లాను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించారు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్. కాంట్రాక్టుల కోసం అధికారుల నుంచి 1 శాతం కమీషన్ డిమాండ్ చేసినట్టు తమ దగ్గర ఆధారాలున్నాయని సీఎంవో పేర్కొంది. ఈ మేరకు ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు సీఎం. “ఆప్ నిజాయితీ గల పార్టీ. మా ప్రభుత్వం 1 రూపాయి అవినీతిని కూడా సహించదు. ఎవరైనా తమను ఈ అవినీతి బురద నుంచి బయట పడేస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా నా పర్యటనల సందర్భంగా ప్రజల దృష్టిలో నేను ఈ ఆశను చూశాను. పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాల్సి వచ్చినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తన అవినీతి వ్యతిరేక లక్ష్యాన్ని నాకు స్పష్టంగా వివరించారు. మేం అదే దిశగా పని చేస్తామని నేను ఆయనకు హామీ ఇచ్చాను. తాజాగా మంత్రిపై అవినీతి కేసు నా దృష్టికి వచ్చింది. మీడియాకు దాని గురించి తెలియదు… నేను ఆయన్ని కాపాడాలనుకుంటే మమ్మల్ని నమ్మిన లక్షల మందిని మోసం చేసి ఉండేవాడిని. కాబట్టి మంత్రిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాను’ అని మాన్ అన్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను విజయ్ సింగ్లా అంగీకరించారని ముఖ్యమంత్రి తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇలాంటి చర్య తీసుకోవడం ఇది రెండోసారి అని ఆయన చెప్పారు. 2015లో అరవింద్ కేజ్రీవాల్ తన ఆహార సరఫరా మంత్రిని తొలగించారు. ఆయన కేసును సీబీఐకి కూడా అప్పగించారని గుర్తు చేశారు భగవంత్.
आम आदमी पार्टी का जन्म ईमानदार सिस्टम कायम करने के लिए हुआ है…@ArvindKejriwal जी ने हमेशा कहा है कि भ्रष्टाचार को बर्दाश्त नहीं करेंगे चाहे कोई अपना हो या बेगाना
स्वास्थ्य मंत्री के खिलाफ भ्रष्टाचार के सबूत मिलते ही तुरंत बर्खास्त किया…साथ ही FIR के आदेश दिए pic.twitter.com/0g9nqGteHb
— Bhagwant Mann (@BhagwantMann) May 24, 2022