సిక్కుల పవిత్ర దినం బైశాఖి సందర్భంగా మద్యం తాగి తఖ్త్ దమ్ దామా సాహిబ్ లోకి ప్రవేశించిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ క్షమాపణ చెప్పాలని గురుద్వారా ప్రబంధక్ కమిటీ డిమాండ్ చేసింది. అసలారోజు సీఎం మద్యం తాగడం ఏంటని నిలదీసింది. మద్యం తాగడమే కాక… తాగి అత్యంత గౌరవనీయమైన, ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సిక్కుల రెహత్ మర్యాద, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఎస్పీజీపీసీ సీనియర్ ప్రెసిడెంట్ రఘుజిత్ సింగ్ విర్క్ అన్నారు. గురు ఘర్ కు గౌరవం ఇవ్వని సీఎం ప్రవర్తన సిగ్గుచేటన్నారు.మాన్ తన తప్పును ఒప్పుకుని మొత్తం సిక్కు సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ సహా చండీగఢ్లోని సిక్కు మందిరాల నిర్వహణకు SGPC బాధ్యత వహిస్తుంది.
SGPC తోపాటు శిరోమణి అకాలీదళ్ చీఫ్, పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్ కూడా భగవంత్ మాన్ మత్తులో మందిరంలోకి ప్రవేశించిడాన్ని ఖండించారు. ఆయన అధికారం చేపట్టాక కనీసం ఆరునెలల వరకు ప్రభుత్వాన్ని విమర్శించాలనుకోలేదని…కానీ సీఎం ఇలా తాగి తఖ్త్ సాహిబ్ లోకి వెళ్లారని తెలిసి మౌనంగా ఉండలేకపోతున్నానని సుఖ్బీర్ అన్నారు. ఇది వరకు కూడా ఆయన తాగి బార్గారి మోర్చాకు వెళ్లారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా మర్యాదలు తెలుసుకోకుంటే ఎలా అని వ్యాఖ్యానించారు.
I didn't want to speak for some time & wanted to give a free rein to the new govt, but @BhagwantMann's actions were however intolerable today. This was not the first time, he has earlier also visited Takht Sri Damdama Sahib in an inebriated condition besides Bargari dharna site. pic.twitter.com/XO1oiYJcYJ
— Sukhbir Singh Badal (@officeofssbadal) April 14, 2022
మరో అకాలీదళ్ నాయకుడు విర్సా సింగ్ వాల్తోహా, భగవంత్ మాన్పై చర్యలు తీసుకోవాలని అత్యున్నత సిక్కు తాత్కాలిక అథారిటీ అకాల్ తఖ్త్ను అభ్యర్థించారు. అలాగే సీఎంకు వైద్య పరీక్షలు నిర్వహించాలని వాల్తోహా డిమాండ్ చేశారు. పరీక్షల్లో నేను తప్పుడు వాదనలు చేసినట్లు రుజువైతే, SAD బహిరంగంగా క్షమాపణలు చెబుతుంది, ఏదైనా శిక్షను ఎదుర్కొంటుంది. కానీ ఆరోపణలు నిజమని తేలితే.. ముఖ్యమంత్రిపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 295-ఎ (ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశపూర్వకంగా మతపరమైన భావాలను రెచ్చగొట్టే చర్యలు) కింద కేసు నమోదు చేయాలని అన్నారు.
అయితే ఆరోపణల్ని ఆమ్ ఆద్మీ పార్టీ తోసిపుచ్చింది. పంజాబ్ ఎన్నికల్లో వారిని తిరస్కరించినందుకే తమ ముఖ్యమంత్రిపై బురజచల్లుతున్నారని పంజాబ్ ఆప్ మండిపడింది.
There are some fired bullets of Punjab politics whose time is up. They're unable to digest their loss in 2022 polls. So, they speak nonsense & go for character assassination: Raghav Chadha, AAP RS MP-elect & Punjab co-incharge on SAD's Sukhbir S Badal's reported remark on CM Mann pic.twitter.com/CV1nCBNouy
— ANI (@ANI) April 14, 2022