ఓ వైపు అగ్నిపథ్ కు దేశవ్యాప్తంగా యువత నుంచి అనూహ్య స్పందన వస్తున్న వేళ.. అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ ప్రకటించారు. అగ్నిపథ్ పథకం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన అనాలోచిత చర్య అని… ఇది సైన్యం పటిష్టతను దెబ్బతీస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
https://twitter.com/BhagwantMann/status/1541704341643337728?s=20&t=RaOqm52SsCIDffoCJVJGjA
డిల్లీ సహా పలుప్రాంతాల్లో అగ్నిపథ్ కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. డిల్లీలో యువనాయకుడు కన్హయ్య కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పెద్ద ఎత్తున యువత ఆయన ఉన్న నిరసన దీక్షా శిబిరం వద్దకు చేరుకుని అగ్నిపథ్ కు అనుకూలంగా నినాదాలు చేశారు.
అటు రాహుల్ సైతం మరోసారి పథకాన్ని వ్యతిరేకిస్తూ మోదీపైన మండిపడ్డారు. తన మిత్రులకు 50 ఏళ్ల కోసం విమానాశ్రయాలు కట్టబెడుతున్న మోదీ…. దేశ యువతకు మాత్రం నాలుగేళ్ల కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు ఇస్తున్నారని ట్వీట్ చేశారు రాహుల్.
https://twitter.com/RahulGandhi/status/1541362199725084673?s=20&t=blS1xxo7-ETDndZAf4_jKQ