కన్నడ సూపర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది ప్రసిద్ధ మైసూరు యూనివర్సిటీ. మరణానంతరం ఆయనకు లభించిన గౌరవాన్ని ఆయన సతీమణి అశ్విని స్వీకరించారు. యూనివర్సిటీ 112 స్నాతకోత్సవాల్లో భాగంగా ముగ్గురికి డాక్టరేట్లు అందచేశారు. 1976లో పునీత్ తండ్రి, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ఇదే యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోగా… మరణానంతరం పునీత్ కూ ఆ గౌరవం అందించారు. పునీత్ సతీమణి అశ్విని భర్త పేరిట ఇస్తున్న డాక్టరేట్ ను స్వీకరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా తన పునీత్ తోపాటు తన అత్త పార్వతమ్మ రాజ్ కుమార్ పేరిట రెండు బంగారు పతకాలను విద్యార్థులకిచ్చి ప్రోత్సహించాల్సిందిగా అశ్విని చేసిన విజ్ఞప్తిని యూనివర్సిటీ అంగీకరించింది. అందుకు కావల్సిన ద్రవ్యాన్ని తామే అందజేస్తామన్నారు అశ్విని. ఇక నుంచి ఆర్ట్స్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి పునీత్ పేరుతో, బిజినెస్ మేనేజ్ మెంట్లో అత్యధిక స్కోర్ సాధించే విద్యార్థికి పార్వతమ్మ పేరుతో గోల్డ్ మెడల్ ఇవ్వనుంది యూనివర్సిటీ.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)