హఠాన్మరణం చెందిన కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇంకాఅభిమానుల గుండెల్లోనే ఉన్నాడు. కర్నాటకలోనే కాదు దక్షిణాదిమొత్తం ఆయనకు అభిమానులున్నారు. తమిళనాడులో మురుగన్ దేవాలయ వేడుకలో ఓ అద్భుత దృశ్యం కనిపించింది. ఏటా ఉత్సవాల్లో ఆలయ పూజారి దేవుని విగ్రహం, ఆభరణాలు, అస్త్రాలను సంప్రదాయ పద్ధతిలో తీసుకువెళ్లడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది నగలు, అస్త్రాల తోపాటు హీరో పునీత్ రాజ్ కుమార్ ఫోటోను కూడా తీసుకువెళ్లాలని ఆలయ కమిటీ అధికారులు, చుట్టు ప్రక్కల 100 గ్రామాల ప్రజలు నిర్ణయించారు.
ఆరు సంవత్సరాల క్రితం ఒకసారి అనుకోకుండా పునీత్ ఆలయాన్ని సందర్శించాడు. ఆ సమయంలో నిధుల కొరత ఏర్పడి.. ఆలయం దయనీయ స్థితిలో ఉంది. విషయం తెలుసుకున్న పునీత్ తక్షణమే దేవాలయాన్ని పునరుద్ధరించడానికి 3 కోట్ల విరాళం అందచేశాడు.
అలా స్థానికుల మదిలో స్థానం సంపాదించుకున్నాడు. అప్పుడాయన చేసిన సాయానికి కృతజ్ఞతగా ఉత్సవాల సందర్భంగా స్మరించుకున్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)