ఇటీవలే రాజ్యసభకు నామినేట్ అయిన ప్రముఖ అథ్లెట్ ఛైర్మన్ కుర్చీలో కూర్చుని సభను నిర్వహించారు.చైర్మన్, వైస్ చైర్మన్ లేని సమయంలో వైఎస్ చైర్ పర్సన్స్ కమిటీ సభ్యుల్లో ఒకరు సభాధ్యక్షులుగా వ్యవహరించడం ఆనవాయితీ. ఈసారి ఆ కమిటీలో ఉన్న పిటిఉషకు ఆ అవకాశం వచ్చింది. కాసేపు ఆమె సభా కార్యకలాపాలను పర్యవేక్షించారు. అందుకు సంబంధించిన వీడియోను ఉష ట్విట్టర్లో షేర్ చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఫ్రాంక్లిన్ రూజ్ వెల్డ్ చెప్పినట్టు గొప్పస్థానం గొప్ప బాధ్యతను కలిగి ఉంటుంది.రాజ్యసభ సెషన్ నిర్వహిస్తున్నప్పుడు నాకు అలాంటి భావనే కలిగింది. ప్రజలు నాపై ఉంచిన నమ్మకంతో ఈ ప్రయాణంలో మరింత పరిణతి సాధిస్తానని ఆమె రాసుకొచ్చారు. అయితే మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉందంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
https://twitter.com/PTUshaOfficial/status/1623575622214684672?s=20&t=nTJUvAXQIcEKJTCSnY5NYw