వెస్ట్ బెంగాల్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ దశలో జరిగే అన్ని ప్రాంతాలు సున్నితమైనవేనని ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినప్పటికీ.. పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. కేష్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార టీఎంసీ పార్టీకి చెందిన కార్యకర్తలు రెచ్చిపోయారు. గుండాల్లో ప్రవర్తిస్తూ.. 173 బూత్ నంబర్కు చెందిన బీజేపీ ఏజెంట్పై దాడికి పాల్పడ్డారు. ఓ మహిళా అని చూడకుండా దాడికి పాల్పడటం.. టీఎంసీ దుశ్చర్యను ఎండగడుతుందని.. ఎన్నికలు సజావుగా జరిగేలా లేవని. టీఎంసీ పారదర్శకంగా ఎన్నికలు జరగనీయదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. కేష్పూర్ బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధి తన్మయ్ ఘోష్కు చెందిన కారుపై కూడా టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు.
West Bengal: BJP polling agent at booth number 173 in Keshpur beaten up allegedly by TMC workers. The polling agent has been rushed to a hospital. BJP leader Tanmay Ghosh's car vandalised
Details awaited
— ANI (@ANI) April 1, 2021