నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడంపై కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాల్లో నిరసనలు చేస్తున్నారు. నేతలు చేసే నిరసనలు కాంగ్రెస్కు వినాశకరమని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. బెంగళూరులో పోలీసులు నిరసనలను అడ్డుకున్నారు, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అదుపులోకి తీసుకున్నారు.
“కాంగ్రెస్ పార్టీ చట్టవిరుద్ధం, చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన కేసుపై నిరసనలు చేస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీ పతనానికి దారి తీస్తుంది” అని బొమ్మై అన్నారు. కాంగ్రెస్ కర్నాటక విభాగం నిర్వహించిన ‘రాజ్భవన్ చలో’ నిరసన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిరసన ప్రదర్శనకు ముందు డికె శివకుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.