జార్ఖండ్ హజారీభాగ్ లో హనుమాన్ ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేసిన షఫీ అహ్మద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూపేష్ పాండే అనే యువకుడు మూకదాడికి బలైన తరువాత ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫిబ్రవరి 6 సరస్వతీ నిమజ్జనానికి వెళ్తున్న హిందూ యువకుల సమూహంపై ఓ గుంపు దాడి చేసింది. దాడిలో తీవ్రంగా గాయపడిన రూపేష్ చనిపోయాడు. దాడి చేసిన 27 మందిపై బర్హి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో మరో 100 మంది గుర్తు తెలియని వారిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో మహ్మద్ అస్లాం, మహ్మద్ అనిస్, మహ్మద్ కైఫ్, మహ్మద్ గుఫ్రాన్, మహ్మద్ చంద్, మహ్మద్ ఒసామా, మహ్మద్ ఎహతామ్, మహ్మద్ నహిద్లను ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు.
శాంతియుతంగా కొవ్వొత్తి ర్యాలీలో పాల్గొన్న హిందువులపైనా పోలీసులు కేసులు పెట్టారు. అంతే కాదు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని పిలుపునిచ్చిన హిందూసంఘాలపైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలకు ప్రభుత్వం సిద్ధమవడం వివాదాస్పదం అయింది. తరువాత ఘర్షణల్లో జాతీయరహదారి -2 లోని జీటీరోడ్డులోని ఆలయంలో విగ్రహ ధ్వంసం పెద్ద ఎత్తున ఆందోళనలకు కారణమైంది. దీంతో అక్కడ 144 సెక్షన్ విధించారు.
హత్యను ఖండిస్తూ ఛత్రాలో క్యాండిల్ మార్చ్ నిర్వహించిన ఆందోళనకారులపై జార్ఖండ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతీయ జనతా పార్టీ, BJYM, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, విశ్వాస్ హిందూ పరిషత్ సభ్యులతో సహా వేలాది మంది ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)