ఉత్తరప్రదేశ్లో ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై దాడిని నిరసిస్తూ…
హైదరాబాద్ లో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసలకు దిగారు. మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం.. చార్మినార్ దగ్గర నిరసన ప్రదర్శన నిర్వహించారు. వందలాది మంది ఎంఐఎం కార్యకర్తలు చార్మినార్ వద్దకు చేరుకుని బీజేపీకి, యూపీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దాదాపు అరగంటపాటు వారి ఆందోళనలు కొనసాగాయి. ఎంఐఎం నిరసనల నేపధ్యంలో…చార్మినార్ చుట్టుపక్క ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు దాడికి నిరసనగా దుకాణాలు, రెస్టారెంట్లు మూసేశారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ నిరసనలు కొనసాగాయి.