సాయుధ దళాలలో సిబ్బందిని స్వల్పకాలికంగా చేర్చుకునే అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా గురువారం బీహార్లో నిరసనలు చెలరేగడంతో సరన్ జిల్లాలోని ఛప్రా వద్ద ప్యాసింజర్ రైలుకు నిరసనకారులు నిప్పు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకారులు రోడ్ల దిగ్బంధం చేసి.. అరా రైల్వే స్టేషన్లో రాళ్లు విసిరారు.
భాగల్పూర్, అర్వాల్, బక్సర్, గయా, ముంగేర్, నవాడా, సహర్సా, సివాన్ సహా ఔరంగాబాద్ జిల్లాల్లో కూడా నిరసనలు చేశారు. బీహార్ నుండి వచ్చిన ఆర్మీ రిక్రూట్లలో ఎక్కువ మంది భోజ్పూర్, సరన్ జిల్లాల నుంచే వచ్చారు. బక్సర్ జిల్లాలో 100 మందికి పైగా ఆర్మీ ఆశావహులు రైల్వే స్టేషన్పై దాడి చేసి పట్టాలపై చతికిలబడ్డారు, పాట్నాకు వెళ్లే జన శతాబ్ది ఎక్స్ప్రెస్ను దాదాపు 30 నిమిషాల పాటు అడ్డుకున్నారు. నిరసనకారులు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు అద్దాలను పగులగొట్టి, కోచ్కు నిప్పంటించారని సమాచారం.
#Bihar | A passenger train was set ablaze at Chhapra in Saran district as protests against the Agnipath scheme for short-term induction of personnel in the armed forces escalated
Read https://t.co/lqlRYn2WuL pic.twitter.com/rAWdRsMmX8
— Hindustan Times (@htTweets) June 16, 2022
అడిషనల్ డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) సంజయ్ సింగ్ మాట్లాడుతూ, కొన్ని నగరాల్లో హింసాత్మక సంఘటనలు, దుకాణాలను బలవంతంగా మూసివేయడం జరిగింది. కానీ ఇతర చోట్ల నిరసనలు శాంతియుతంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
జెహనాబాద్లో నిరసనకారులు రాళ్లు విసిరారు, రైల్వే ట్రాక్లను క్లియర్ చేయడానికి వారిని తరిమికొట్టిన పోలీసు సిబ్బందితో సహా పలువురు గాయపడ్డారు. జెహనాబాద్ రైల్వే స్టేషన్ లో ఘటన దృశ్యాలలో పోలీసులు, నిరసనకారులు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నట్టు తెలుస్తోంది.
#WATCH | Bihar: Youth demonstrate in Chhapra, burn tyres and vandalise a bus in protest against the recently announced #AgnipathRecruitmentScheme pic.twitter.com/Ik0pYK26KY
— ANI (@ANI) June 16, 2022
నవాడలో, ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తూ ఒక యువకుల బృందం రైల్వే ట్రాక్లను అడ్డుకుని టైర్లను తగులబెట్టారు.