గుజరాత్ లో అసదుద్దీన్ కు నిరసనల తెగ తగిలింది.అది కూడా ముస్లిం యువకుల నుంచి. సౌత్ ఈస్ట్ లో బహిరంగసభలో పాల్గొన్న ఆయనకు కొందరు నల్లజెండా ఊపి నిరసన తెలిపారు. ఆయన వేదికపైకి వెళ్లేముందు కూడా మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు.
అక్కడినుంచి బరిలో ఉన్న వసీం ఖురేశికి మద్దతుగా ప్రచారం కోసం ఒవైసీ ఆదివారం అక్కడికి చేరుకున్నారు. అక్కడి సభలో ప్రసంగించారు.ఆయన వేదికపైకి రాగానే … కొందరు యువకులు ఆయనకు నల్లజెండా చూపుతూ నినాదాలు చేశారు. మోదీ మోదీ అంటూ కొందరు, వాపిస్ జావో, వాపస్ జావో అంటూ గట్టిగా అరిచారు.
అంతకుముందు అహ్మదాబాద్ డానిలిమ్టాలో ఆయన సభ ఉండాల్సి ఉంది. ఎస్సీ రిజర్వుడ్ స్థానం అయిన అక్కడినుంచి ఒవైసీ కౌశిక్ పర్మార్ ను నిలిపారు. అయితే ఆయనకు వెన్నునొప్పి ఉండడంతో ర్యాలీని రద్దు చేశారు.గుజరాత్ లో ఒవైసీకి ముస్లింలనుంచి నిరసన ఎదురవడం ఇదేం మొదటిసారి కాదు.ఈ ఏడాది మేలో కూడా సూరత్ లో ఆయనకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.
https://twitter.com/NewsArenaIndia/status/1592018230281109508?s=20&t=8hOueUQ0AOugAb6_AfSvcw
సూరత్ ఈస్ట్ ప్రాంతం గోపిపురా ప్రాంతంలో గణనీయమైన ముస్లిం జనాభా ఉంది. నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలలో కమ్యూనిటీల పోలరైజేషన్ మరియు డెమోగ్రఫీ మార్పును నివారించడానికి తీసుకొచ్చిన డిస్టర్బ్డ్ ఏరియా యాక్ట్ అమలులో ఉంది. వక్ఫ్ ఇటీవల దావా వేసిన సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ భవనం కూడా సూరత్ తూర్పు నియోజకవర్గం కిందకే వస్తుంది.
2014లో, సూరత్లోని గోపీపురా ప్రాంతంలో ఉంటున్న జైన సాధ్వి, గోపీపురాలో తాను ఎదుర్కొంటున్న వేధింపుల గురించి భారత రాష్ట్రపతి, గుజరాత్ గవర్నర్, ప్రధాని మోదీ, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ సహా ఇతర నేతలకు లేఖ రాశారు. వందలఏళ్లుగా సూరత్ జైనుల ప్రాంతంగా ఉంది. అయితే క్రమంగా ఆ ప్రాంతంలో ముస్లింల జనాభా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడక్కడ మెజారిటీలు ముస్లింలే. గోపీపురా సాధ్విలు ఉండే ఉపాశ్రయాలకు సమీపంలో కిలోమీటర్ల పరిధిలో 25 జైన దేవాలయాలు, 35 ఉపాశ్రయాలున్నాయి. 70-80 మంది జైన సాధ్వులు అక్కడుండేవారు. కానీక్రమంగా ముస్లింలు వచ్చి అక్కడ ఉండిపోతున్నారు.
సూరత్ ఈస్టులో 77,365 మంది ముస్లిం ఓటర్లు ఉండగా, హిందూ ఓటర్లు 35,427 మంది ఉన్నారు. 1990 నుంచి ఒక్క 2002 లో తప్ప ప్రతిసారీ ఇక్కడినుంచి బీజేపీ అభ్యర్థే గెలుస్తున్నారు. ఇక్కడ నివసించే చాలామంది శాంతిని కోరుకుంటారని..ఎక్కువశాతం వ్యాపారాలు చేసుకునే బోహ్రా వర్గానికి చెందిన వారే. తమ వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు కల్పిస్తున్న బీజేపీ వైపే వారు ఎక్కువగా మొగ్గు చూపుతారు. డాని లిమ్డా మరో ముస్లిం ఆధిపత్య ప్రాంతం. అయితే ఎస్సీ రిజర్వుడు స్థానం. 50శాతం ముస్లింలు, దళితులు ఉన్నారు. ఈ ప్రాంతాన్ని సున్నితమైన ప్రాంతంగా గుర్తించిన ప్రభుత్వం డిస్టర్బ్ డ్ ఏరియా యాక్ట్ ను అమలు చేస్తోంది. సీఏఏను వ్యతిరేకిస్తూ ఇక్కడ హింస చెలరేగింది.
https://twitter.com/oursuratcity/status/1528642520258777088?s=20&t=4wjWBJ627BEVj6HPX28a1Q