యుఎస్ కాంగ్రెస్ ప్రతినిధి ఇల్హాన్ ఒమర్ పీవోకే పర్యటనపై చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ డిమాండ్లను చట్టబద్ధం చేయడానికి ఆమె ప్రయత్నించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఖండించింది. ఇల్హాన్ ఒమర్ పర్యటనపై మోదీ ప్రభుత్వం ఘాటుగానే స్పందించింది.
US Congresswoman Ilhan Omar(@IlhanMN) accompanied by a delegation called on the President of the State of Azad Jammu and Kashmir Barrister Sultan Mehmood Chaudhary (@BarrSultan )in the President House Muzaffarabad.
1/2#KashmirLivesMatter pic.twitter.com/MbaHmXU7Sp— Govt of Azad Jammu & Kashmir (@GovtofAJK) April 21, 2022
ఇక ఈ సందర్భంగా గతంలో జరిగిన ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు.2011లో, పీఓకేలో సత్పర డ్యామ్ నిర్మాణానికి USAID నిధులు సమకూర్చినప్పుడు, భారత్ లోని UPA ప్రభుత్వం మౌనం వహించింది.
ఆనకట్ట నిర్మాణం దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉన్నప్పటికీ మౌనంగా ఉన్నారు.
2011, జనవరి 6న పాకిస్తాన్ అవసరాలను తీర్చడానికి రెండు డ్యామ్ల నిర్మాణానికి మద్దతుగా 66 మిలియన్ డాలర్లను అందజేస్తానని యునైటెడ్ స్టేట్స్ ప్రకటించింది. సత్పరా ఆనకట్ట ఆ రెండు ఆనకట్టలలో ఒకటి, ఇది గిల్గిట్-బాల్టిస్తాన్ (పాకిస్తాన్ అక్రమ ఆక్రమణలో ఉన్న భూభాగం)లోని స్కర్డు పట్టణంలో ఉంది.
ఈ విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు, పాకిస్తాన్ నుంచి అప్పటి స్పెషల్ రిప్రజెంటేటివ్ ఫ్రాంక్ రగ్గిరో ఇలా వ్యాఖ్యానించారు, “గత సంవత్సరం వినాశకరమైన వరదలు, వరద నియంత్రణ మౌలిక సదుపాయాల అవసరాన్ని తెచ్చాయి. ఈ రెండు బహుళార్ధసాధక ఆనకట్టలు వరదనీటిని నియంత్రిస్తాయి. విద్యుత్తును అందిస్తాయి. దిగువ గ్రామాలకు నీటిపారుదల, గృహ అవసరాల కోసం నీటిని నిల్వ చేస్తాయి. క్లిష్టమైన ప్రాంతాల్లో’ ఆర్థికాభివృద్ధిని తీసుకొచ్చే ప్రాజెక్టులలో పాకిస్థాన్కు అమెరికా సహాయం కొనసాగిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. సత్పర డ్యామ్లోని పవర్హౌస్ యూనిట్ నం.1, యూనిట్ నం.2 .. 2008 నాటికి పని చేస్తున్నప్పుడు, పవర్ హౌస్ యూనిట్లు నెం. 3, నెం. 4 ల నీటిపారుదల వ్యవస్థల ప్రధాన కాలువలకు US నిధులు సమకూర్చింది.
గిల్గిట్ బాల్టిస్తాన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వివాదాస్పద భూభాగం అయినందున, ఆనకట్టకు US మద్దతు వివాదాస్పదమని అండర్ప్రెజెండెడ్ నేషన్స్ & పీపుల్స్ ఆర్గనైజేషన్ (UNPO) పేర్కొన్నాయి. ఆనకట్ట నిర్మాణం పురాతన రాతి శిల్పాలను నాశనం చేయగలదని, స్థానిక జనాభాను స్థానభ్రంశం చేయగలదని అవి ఎత్తి చూపాయి.
“సత్పర డ్యామ్ను పూర్తి చేయడం ద్వారా స్థానిక పవర్ గ్రిడ్కు 17.6 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని జోడించడం ద్వారా దాదాపు 40,000 గృహాలకు విద్యుత్ను సరఫరా చేసేందుకు తగినంత శక్తిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది” అని యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (USAID) తన నివేదికలో పేర్కొంది. ఆనకట్ట ఈ ప్రాంతంలో వరదలను కూడా తగ్గిస్తుంది, దిగువ భూమికి సాగునీరు అందించడానికి నీటిని నిల్వ చేస్తుంది, గృహ అవసరాల కోసం రోజుకు 3.1 మిలియన్ గ్యాలన్ల నీటిని అందిస్తుంది” అని చెప్పింది.
సత్పర డెవలప్మెంట్ ప్రాజెక్ట్ (SDP) కోసం మార్చి 12, 2012న అగాఖాన్ ఫౌండేషన్ మరియు USAID మధ్య ఒప్పందం కుదిరింది. పవర్ హౌస్ యూనిట్ నెం.3 మే 2013లో పని చేయగా పవర్ హౌస్ యూనిట్ నంబర్ 4 జూన్ 2013లో పని చేయడం ప్రారంభించింది.
ఇల్హాన్ ఒమర్ పర్యటనపై మోదీ ప్రభుత్వ ప్రస్తుత ప్రతిస్పందనకు విరుద్ధంగా, 2011 – 2013 మధ్య భారతదేశ భూభాగంలో US అకృత్యాలను సరిగా ఖండించలేదు. భారతదేశం అనుమతి లేకుండా ఆనకట్టలు నిర్మించడంలో, ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో సహాయం చేయడం ద్వారా, యునైటెడ్ స్టేట్స్ దేశం యొక్క ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)