దేశీయ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. స్టీల్ కంపెనీల షేర్లు భారీ లాభాలను ఆర్జించడంతో సెనెక్స్ లాభాల బాట పట్టింది. 49,868 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించిన సెన్సెక్స్ 520 పాయింట్లు లాభపడింది. ఒక దశలో 49,478 వద్ద కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివరకు కోలుకుని 50,092 వద్ద రోజును ముగించింది. ఇక, 14,798 వద్ద రోజును ప్రారంభించిన నిఫ్టీ 176 పాయింట్లు ఎగబాకి 14,867 వద్ద స్థిరపడింది. జేఎస్డబ్ల్యూ, హిందాల్కో, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ లాభాలను ఆర్జించగా.. హెచ్యూఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నష్టాలను చవిచూశాయి.