కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంకా వాద్ర సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. ఆమె భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా పాజిటివ్ సోకడంతో.. ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల అస్వస్థతకు గురవ్వడంతో.. ఆయన కరోనా నిర్ధారణ టెస్టులు చేయించుకోగా.. రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. అయితే భర్త రాబర్ట్ వాద్రాకు పాజిటివ్ రావడంతో వెంటనే.. ప్రియాంక కూడా కరోనా టెస్టులు చేయించుకోగా.. రిపోర్టులో నెగిటివ్ వచ్చింది. ముందస్తు జాగ్రత్తగా వాద్రాతో పాటు ఆమె కూడా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి ప్రియాంక వాద్రా బ్రేక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
https://twitter.com/ANI/status/1377901359563821057