తమ పిల్లల ఇన్స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ అయ్యాయన్న ప్రియాంక వాద్రా గాంధీ ఆరోపణల్ని కేంద్రం కొట్టేసింది. వాళ్ల ఖాతాలు హ్యాకవలేదని స్పష్టం చేసింది.
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సీఈఆర్టీ-ఇన్ ప్రాథమిక దర్యాప్తులో ఖాతాలు హ్యాక్ కాలేదని తేలిందని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. తన పిల్లలైన 18 ఏళ్ల మిరయా వాద్రా, 20 ఏళ్ల రైహాన్ వాద్రాల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను బీజేపీ ప్రభుత్వం హ్యాక్ చేసి… సాధిస్తోందని ప్రియాంక ఆరోపించారు.
తన ఫోన్ ట్యాపింగ్ మాత్రమే కాదు చివరకు నా పిల్లల ఇన్ స్టా ఖాతాల్నీ హ్యాక్ చేస్తున్నారు. వారికి మరో పనిలేన్నట్టుందని ఆమె వ్యాఖ్యానించారు.
అయితే ప్రియాంక ఈ ఆరోపణల్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది.
ప్రియాంక వాద్రా అధికారికంగా ఫిర్యాదు చేయక పోయినా ….ఆమె ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వచ్చేటట్లు చేయడంతో సొంతంగా విచారణ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని సీఈఆర్టీ-ఇన్కు అప్పగించింది. సీఈఆర్టీ- ఇన్ హ్యాకర్లను కనుగొనే, సైబర్టాక్లను నిరోధించే అధునాతన ల్యాబ్ను నడుపుతోంది. పెగాసస్ స్పైవేర్ సమస్య పబ్లిక్గా మారినప్పటి నుంచి ఫోన్ నిఘాపై ఆరోపణలు వెల్లువెత్తాయి.