అల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కుటుంబం నుంచి మిలియన్ పౌండ్ల విరాళాలు స్వీకరించారు ప్రిన్స్ చార్లెస్. ఆ విషయం ఆలస్యంగా ఇప్పుడు బయటపడింది. సండే టైమ్స్ నివేదిక ప్రకారం 2013లో అంటే ఒసామా హతమైన రెండేళ్లకు తన ఇద్దరు సోదరుల నుంచి చార్లెస్ ఈ విరాళం స్వీకరించాడు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చారిటబుల్ ఫండ్ ఈ మొత్తాన్ని విరాళంగా తీసుకుంది.
లాడెన్ సోదరులు బకర్ బిన్ లాడెన్, షఫిక్ లాడెన్ల నుంచి ప్రిన్స్ చార్లెస్ స్వయంగా ఈ మొత్తాన్ని స్వీకరించాడు. అయితే వారినుంచి నిధులు తీసుకోవడం ట్రస్ట్ ముఖ్యులు, క్లారెన్స్ హౌస్ నిపుణులకు కానీ ఇష్టం లేదు. కరడుగట్టిన ఉగ్రవాది అయిన లాడెన్ కుటుంబం నుంచి మిలియన్ పౌండ్లు ట్రస్ట్ కోసం తీసుకోవద్దని చార్లెస్ కు ఆయన స్నేహితులు సహా కొందరు సలహా ఇచ్చారు కూడా.. అయినా చార్లెస్ ఆ మొత్తాన్ని స్వీకరించడానికే సిద్ధమయ్యారు. ఇక తప్పదన్నట్టు ట్రస్టీలు సైతం అంగీకరించారు. అయితే తగు జాగ్రత్తలు తీసుకున్నామని… బిన్ లాడెన్ ఉగ్రకార్యకలాపాలతో అతని కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఇప్పుడు ట్రస్ట్ వాదిస్తోంది.
కామన్వెల్త్ దేశాలు, ఇతర దేశాల్లో యునైటెడ్ కింగ్ డమ్ నిర్వహించే కార్యక్రమాల కోసం… రిజిస్టర్ అయిన సంస్థలకు PWCF ఈ నిధులు ఇస్తుంది. ప్రిన్స్ చార్లెస్ కు చెందిన మరో స్వచ్ఛందసంస్థపైనా పలు ఆరోపలున్నాయి. సౌదీ వ్యాపారవేత్త మహ్ఫౌజ్ మారీకి తో సంబంధం ఉన్న Cash for Honor స్కాంలో చార్లెస్ హస్తంపై ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చార్లెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రిహాబిలిటేషన్ ప్రాజెక్టులకు ముబారక్ సహకారం అందించినట్టు తేలింది. అయితే అవన్నీ ఆరోపణలేనని కొట్టేశాడు సౌదీ బిలియనీర్ ముబారక్.