ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు వచ్చిన బహుమతులను నేటినుంచి వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. అందులో దేశ, విదేశాలకు చెందిన పలువురు ఇచ్చిన జ్ఞాపికలు సైతం ఉన్నాయి. ఇక తెలంగాణ నుంచి ప్రధాని అందుకున్న పలు కానుకలను కూడా వేలంలో ఉంచారు. వాటిలో అఖిల భారత చెస్ ఫెడరేషన్ ప్రధాని మోదీకి గతంలో బహూకరించిన వెండి వీణ వేలంలో ఉంది. కరీంనగర్ జిల్లా కళాకారులు చేసిన ఈ వీణ మూల ధర రూ.2.16 లక్షలు. దాన్ని వేలంలో ఎవరు దక్కించుకుంటారో చూడాలి.