ప్రధాని మోదీ జపాన్ వెళ్లారు.. క్వాడ్ సమ్మిట్లో ఆయన పాల్గొననున్నారు. కోవిడ్ మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టిన తరువాత మోదీ అధికారిక విదేశీ పర్యటనలు ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన పర్యటన పై ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదేంటంటే మోదీ రాత్రిపూట మాత్రమే ప్రయాణం ఎందుకు పెట్టుకుంటారూ అని..
చర్చ సందర్భంగా ఆయన ప్రయాణ ప్రణాళికలకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు బయటకు వచ్చాయి.
కఠినమైన పని షెడ్యూల్ను కలిగి ఉండే ప్రధాని మోదీ, సమయాన్ని ఆదా చేయడానికి రాత్రిపూట ఎక్కువగా ప్రయాణిస్తారని సమాచారం.
ప్రధాని మోదీ ఆదివారం రాత్రి జపాన్కు బయలుదేరి, మే 23అంటే సోమవారం ఉదయం టోక్యో చేరుకున్నారు.
ఉదయం నేరుగా అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యారు.ఎక్కడా నిమిషం కూడా సమయం వృథాకాలేదు.
ఈ నెలలో ప్రధాని 5 దేశాలను సందర్శించినప్పటికీ ఆ దేశాలలో కేవలం 3 రాత్రులు ఆయా దేశాల్లో ఉంటే… సమయాన్ని ఆదా చేయడానికి 4 రాత్రులు విమానంలోనే గడిపారు” అని బీజేపీ ఐటీ-సెల్ హెడ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు.
సమయం, వనరులను ఆదా చేసేందుకు మోదీ తన విదేశీ పర్యటనల షెడ్యూల్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే రాత్రిపూట ప్రయాణాలు. తద్వారా ఆయన ఉదయాన్నే అక్కడికి చేరుకుని…వెంటనే అధికారిక సమావేశాలకు హాజరవుతారు.
ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న మోదీ… టోక్యోలో జరిగే క్వాడ్ సమ్మిట్లో పాల్గొననున్నారు. క్వాడ్ అనేది ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ సహా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య జరిగే వ్యూహాత్మక భద్రతా సంభాషణ.
ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా నూతనంగా ఎన్నికైన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో కూడా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు మోదీ.
మోదీ ఇటీవలి జర్మనీ, డెన్మార్క్లలో పర్యటనల సందర్బంగా అక్కడ కేవలం ఒక రాత్రి మాత్రమే గడిపారు. ఇప్పుడు టోక్యోలోకూడా అంతే.
తొంభైవ దశకంలో మోదీ తన విదేశీ పర్యటనలను ప్రారంభించినప్పుడు కూడా ఆయన పగటిపూట గమ్యస్థానాలను సందర్శించి, అక్కడి చివరి విమానంలో తిరిగి వచ్చేసేవారు.తద్వారా హోటల్లో బస చేసే డబ్బు ఆదా అవుతుంది. ఆయన తరచుగా విమానం, విమానాశ్రయాలలో నిద్రించేవారని పీఎంవో వర్గాలు
వెల్లడించాయి.