డిఫెన్స్ వివిధ రెజిమెంట్ సెంటర్లలోని అగ్నివీరుల తొలిబ్యాచ్ తో ప్రధాని నరేంద్రమోదీ ముఖాముఖి నిర్వహించారు. గోవా, హైదరాబాద్, మద్రాస్, పుణె, మధ్యప్రదేశ్లోని సాగర్, హిమాల్ ప్రదేశ్లోని సబాతులో శిక్షణ పొందుతున్న అగ్నివీరులతో ప్రధాని మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. పర్సనల్ బిలో ఆఫీసర్ ర్యాంకు కింద సుమారు 25,000 మంది సిబ్బంది తొలిబ్యాచ్లో అగ్నివీరులుగా శిక్షణ పొందుతున్నారు. ఇండియన్ ఆర్మీలో 19,000 మందిని, నేవీ, ఎయిర్పోర్స్ర్స్లో చెరో 3,000 మందిని ఎంపిక చేశారు. ఆరు నెలల శిక్షాకాలం పూర్తి కాగానే, మరో 3.5 నెలల పాటు వారు సర్వీసులో కొనసాగుతారు. మొత్తం నాలుగేళ్ల పాటు వీరు సర్వీసులో ఉంటారు. అయితే వాళ్లలో ప్రతిభ ఆధారంగా 25 శాతం మందిని తిరిగి రిక్రూట్ చేసుకుని మరో 15 ఏళ్లు సర్వీసు కల్పిస్తారు. తక్కిన 75 శాతం మందికి రిటైర్మెంట్ ప్యాకేజీ ‘సేవా నిధి’ ఇస్తారు.
https://twitter.com/narendramodi/status/1614491741834608641?s=20&t=taB6TgrbjDFWv5u6vbFGXg