సొంత రాష్ట్రంలో ఓ వైపు పోలింగ్ జరుగుతుండగానే మరోవైపు అతిపెద్ద ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు మోదీ. దేశంలో ఇప్పటివరకు ఏ నాయకుడూ చేయలేని విధంగా అతిపెద్ద రోడ్ షోలో నిర్వహించారాయన. 16 నియోజకవర్గాల మీదుగా 50 కిలోమీటర్లపాటు రోడ్ షో సాగింది. గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు అహ్మదాబాద్లోని నరోదా గావ్ దగ్గర ప్రారంభమైన ఈ రోడ్ షో గాంధీనగర్లో ముగిసింది. 2002 లో గోద్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ అగ్నిప్రమాదం అనంతరం జరిగిన అల్లర్లలో నరోదా గావ్ ఒకటి. ఠక్కర్బాపానగర్, బాపునగర్, నికోల్, అమ్రైవాడి, మణినగర్, డానిలింబ్డా, జమాల్పూర్ ఖాడియా, ఎలిస్బ్రిడ్జ్, వేజల్పూర్, ఘట్లోడియా, నారన్పూర్, సబర్మతితో సహా మొత్తం 16 అసెంబ్లీ స్థానాల్లో ఈ ర్యాలీ కొనసాగి గాంధీనగర్ సౌత్ నియోజకవర్గంతో ముగిసింది. రోడ్ షో ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది… వేలాదిగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు రోడ్డుకిరువైపులా చేరి మోదీకి స్వాగతం పలికారు. పార్టీ జెండాలు, జాతీయ జెండాలతో ఆ ప్రాంతమంతా కళకళలాడింది. ఓపెన్ టాప్ వాహనంలో వెళ్తూ అందరికీ అభివాదం చేస్తూ పలకరిస్తూ, ఉత్సాహపరుస్తూ ముందుకు సాగారు మోదీ. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. 89 స్థానాల్లో 60.23 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 182 స్థానాల్లోని మిగతా 93 స్థానాలకు డిసెంబర్ 5న పోలింగ్ జరగనుంది.
Yesterday was special.
Words cannot describe the love and affection I received from people.
Sharing highlights from Ahmedabad. pic.twitter.com/87Vtgbloa4
— Narendra Modi (@narendramodi) December 2, 2022