మిలిటరీ డ్రెస్ లో ప్రధాని మోదీ సందడి చేశారు. ఖాకీజాకెట్, నీలి కళ్లద్దాలు, టోపీ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెద్ద పులుల సంరక్షణకు చేపట్టిన ‘ప్రాజెక్ట్ టైగర్’ స్వర్ణోత్సవాల సందర్భంగా కర్నాటక వచ్చారు మోదీ. బందీపుర పులుల సంరక్షణ కేంద్రంలో గడిపారు. ఈ సందసందర్భంగా ఆకట్టుకునే గటప్ లో…. ఓపెన్ సఫారీలో దాదాపు 20 కిలోమీటర్లు పర్యటించారు. తన వెంట తెచ్చుకున్న కెమెరాతో అడవి అందాల్ని బంధించారు. తాను స్వయంగా తీసిన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు కూడా. పెద్దపులి, సింహం, చిరుత, మంచు చిరుత, చీతా, ప్యూమ, జాగ్వార్ తదితర ఏడు రకాల క్రూర మృగాల సంరక్షణ కోసం ఐబీసీఏ(ఇంటర్నేషనల్ బిగ్ కేట్ అలయెన్స్) కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రారంభించారు. ‘అమృత్కాల్ కా టైగర్ విజన్’ పేరిట రాసిన బుక్లెట్ను ఆవిష్కరించారు. పులుల సంతతికి సంబంధించిన నివేదికను, .ప్రత్యేక నాణేన్ని కూడా విడుదల చేశారు. భారతదేశం పెద్దపులులను సంరక్షించడంతోపాటు వాటి వృద్ధికి తగిన పర్యావరణాన్ని సృష్టించిందని తెలిపారు. దేశంలో పెద్ద పులుల సంఖ్య 2006లో 1,411 ఉండగా, ఇప్పుడు 3,167కు చేరిందని తెలిపారు. ప్రపంచ పులుల సంఖ్యలో 75 శాతం భారత్లోనే ఉండటం గర్వకారణమన్నారు. దశాబ్దాల క్రితమే దేశంలో చిరుతలు అంతరించిపోగా, ఇటీవల దక్షిణాఫ్రికాలోని నమీబియా నుంచి వాటిని తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇక తన పర్యటనలో భాగంగా… తమిళనాడులోని నీలగిరి జిల్లా మధుమై తప్పకాడు ఏనుగుల సంరక్షణా కేంద్రాన్నికూడా మోదీ సందర్శించారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ నటీనటులు రఘు, బొమ్మి దంపతులను సత్కరించారు. వారు పెంచుతున్న గున్నఏనుగులకు పండ్లు, చెరకు తినిపించారు. గజరాజుల ఆశీర్వాదం తీసుకున్నారు. మావటిలతో మాట్లాడుతూ గంటకు పైగా అక్కడే గడిపారు. ఏనుగుల సేవలోనే ఆనందం పొందుతున్నామని …ప్రధాని స్వయంగా తమ దగ్గరకు రావడం ఆనందంగా ఉందని రఘు, బొమ్మి అన్నారు.
https://twitter.com/narendramodi/status/1644946227598098432?s=20
https://twitter.com/narendramodi/status/1644974611438899200?s=20