అటు దేశంలో కోవిడ్ ఇబ్బందులు, తీసుకుంటున్న చర్యలపై కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేయాలని…రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. రాష్ట్రాల్లో నెలకొన్న తాజా పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. మందుల లభ్యత, కేంద్రంనుంచి రాష్ట్రాలకు అందుతున్న సహకారం వివరాలగురించి చర్చించారు.
ముఖ్యంగా వాక్సినేషన్ వేగవంతం చేయాలన్న పీఎం…తీవ్ర ప్రభావవంతం అవుతున్న రాష్ట్రాల్లో టీకా ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేయాలనీ అన్నారు. ఇక వాక్సిన్ ఉత్పత్తిని పెద్దఎత్తున చేపట్టేలా రోడ్ మ్యాప్ పైనా చర్చ జరిగింది. లాక్ డౌన్ ఉన్న రాష్ట్రాల్లో వాక్సిన్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వాక్సినేషన్ పనుల్లో ఉన్న ఆరోగ్య కార్యకర్తలను ఇతర విధులకు వినియోగించవద్దనీ సూచించారు. కోవిడ్ చికిత్సలో అత్యవసరమని చెబుతున్న రెమ్డిసివర్ సహా ఇతర మందుల కొరత, బ్లాక్ మార్కెట్ గురించీ ఆరా తీశారు. మంత్రులు అమిత్షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ సహా పలువురు మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.