ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించే రేడియో ప్రోగ్రామ్ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. దేశ ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడే కార్యక్రమం ఇది. ప్రభుత్వ పథకాలను ప్రస్తావిస్తూ..గుర్తింపు కోరుకోని వ్యక్తులు, వ్యవస్థల పనిని, ఎన్నో ప్రేరణాత్మక అంశాలన్ని మన్ కీ బాత్ వేదిగ్గా మోదీ ప్రస్తావిస్తుంటారు.
2014 అక్టోబర్ 3న ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి నెలా చివరి ఆదివారం మధ్యాహ్నం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియా, డీడీ నెట్వర్క్లో ‘మన్ కీ బాత్’ ప్రసారం అవుతోంది. అయితే కార్యక్రమం వంద ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న సందర్భంగా… వంద రూపాయల నాణేన్ని విడుదల చేస్తున్నారు. ఈ కాయిన్ను వెండి, రాగి, నికెల్, జింక్తో తయారు చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు తెలుగు ప్రముఖుల పేర్లనూప్రధాని తన ప్రసంగంలో గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్ అవగాహనే కోసం మీడియా అధినేతగా రామోజీరావు చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రతీ వర్షపు నీటిబొట్టును ఒడిసిపడుతూ… వాటిని కాలువలుగా మళ్లించి నీటికుంటలను నిర్మించిన తిమ్మాయపల్లి ప్రజల సంకల్పాన్నీ ప్రస్తావించారు. బోయినపల్లి కూరగాయల మార్కెట్ లో 10 టన్నుల వ్యర్థాలతో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న విషయం గుర్తు చేశారు. 7 ‘ల్యాబ్ టు ల్యాండ్’ మంత్రంతో తెలంగాణకు చెందిన చింతల వెంకట రెడ్డి వ్యవసాయ రంగంలో చేస్తున్న కృషినీ, ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం గురించీ మాట్లాడారు.విజయనగరం జిల్లాలో వయోజన విద్యను ప్రోత్సహించిన మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు కృషిని మన్ కీ బాత్ వేదిగ్గా ప్రశంసించారు. ఆటో మొబైల్ సంబంధిత వ్యర్థ పదార్థాలతో కళాఖండాలను తీర్చిదిద్దుతున్న శ్రీనివాస్ పేరెత్తారు. నంద్యాలలో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభించిన కేవీ సుబ్బా రెడ్డిని అభినందించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ, చిత్తూరు జిల్లాల్లో పండించే బంగినపల్లి మామిడి పండ్లను దక్షిణ కొరియాకు ఎగుమతి చేస్తారంటూ… భూగర్భ జలాలను పెంచే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన నీరు ప్రగతి కార్యక్రమం అద్భుతమంటూ ప్రశంసల వర్షం కురిపించారు.